దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ లక్షలాది మంది వైరస్ బారినపడుతున్నారు. తాజాగా టీమ్ఇండియా క్రికెటర్ యుజువేంద్ర చాహల్ తల్లిదండ్రులకు కరోనా సోకిందని అతని భార్య ధనశ్రీ వర్మ గురువారం సోషల్మీడియా పోస్ట్లో తెలిపింది. చాహల్ తండ్రి తీవ్రమైన వ్యాధి లక్షణాలతో ఆస్పత్రిలో చేరినట్లు వెల్లడించింది. వైరస్ సోకడంతో చాహల్ తల్లి ఇంట్లోనే చికిత్స పొందుతున్నట్లు ఆమె వివరించింది.
ఐపీఎల్ 2021 సీజన్ సందర్భంగా బయోబబుల్లో ఉన్న సమయంలో ధనశ్రీ తల్లి, సోదరుడికి కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఐపీఎల్లో చాహల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తుండగా ఆమె బబులోనే ఉండటంతో వారి వద్దకు వెళ్లలేకపోయింది. ఆ ఇద్దరూ వైరస్ నుంచి కోలుకున్నట్లు తర్వాత పేర్కొంది.