పేద ముస్లింలకు పంపిణీ చేస్తున్న సర్కారు
హర్షం వ్యక్తం చేస్తున్న మైనార్టీలు
మహబూబ్నగర్ టౌన్, మే 11 : మున్సిపాలిటీలోని 10వ వార్డు రాబియా మసీదులో మంగళవారం కౌన్సిలర్ రాణి ముస్లింలకు రంజాన్ కానుకలు పంపిణీ చేశారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు వరలక్ష్మి, నాయకులు రావూఫ్, రవి పాల్గొన్నారు.
జడ్చర్ల మున్సిపాలిటీలో..
జడ్చర్ల, మే 11 : రాష్ట్ర ప్రభుత్వం పేద ముస్లింలకు సరఫరా చేసిన రంజాన్ కానుకలను మంగళవారం జడ్చర్ల ము న్సిపాలిటీలోని 5, 24 వార్డుల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమా ల్లో కౌన్సిలర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 5వ వార్డులోని ఆమేనా మదర్సాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ వార్డు కౌన్సిలర్ నవనీతాకిరణ్ రంజాన్ కానుకలను పం పిణీ చేశారు. 24వ వార్డులోని ఖవతుల్ ఇస్లాం మసీద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో వార్డు కౌన్సిలర్ కోట్ల ప్రశాంత్రెడ్డి రంజాన్ కానుకలను పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో ప్రజలు రంజాన్ పండగను నిరాడంబరంగా జరుపుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకరులు ఇఫ్తేకారోద్దిన్, హసీబ్, సామి, సిరాజ్, కొండల్, అశ్వక్, హఫీజ్, రియాజ్ పాల్గొన్నారు.
అడ్డాకుల మండలంలో..
మూసాపేట(అడ్డాకుల), మే 11 : రంజాన్ మాసాన్ని పు రస్కరించుకొని ప్రభుత్వం ముస్లింలకు ఉచితంగా అందజేస్తున్న దుస్తులను అడ్డాకుల మసీదులో మంగళవారం నా యబ్ తాసిల్దార్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ జితేందర్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, మండ ల కోఆప్షన్ సభ్యుడు ఖాజాగోరి, సర్పంచ్ శ్రీకాంత్, ఎంపీటీసీ గణేశ్, మండల కోఆప్షన్ మాజీ సభ్యుడు షఫీ అహ్మద్, మజీద్ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.
మూసాపేట మండలంలో
మూసాపేట, మే 11 : మైనార్టీ కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమాన్ని మూసాపేట తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ మంజుల ప్రారంభించారు. ఆయా గ్రామాల మసీదు కమిటీల సభ్యులు, మత పెద్దలకు గ్రామా ల వారీగా దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మం డల కోఆప్షన్ సభ్యుడు ఎండీ జమీర్, జానంపేట సర్పంచ్ శ్రీనివాసులు, ఉపసర్పంచ్ నందిపేట శేఖర్, మైనార్టీ నాయకులు ఎండీ ఖలీం, ఖాదర్, చెన్నయ్య, సీనియర్ అసిస్టెంట్ మానస ఉన్నారు.
అన్ని వర్గాలకు సమన్యాయం
దేవరకద్ర రూరల్, మే 11: రాష్ట్ర ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలను సమానంగా చూస్తుందని ఎంపీపీ రమాదేవి అన్నారు. మంగళవారం దేవరకద్ర మండల పరిషత్ కార్యాలయంలో రంజాన్ పండుగకు ప్రభుత్వం నుంచి సరఫరా అయిన రంజాన్ కానుకను ముస్లింలకు పంపిణీ చేశా రు. కార్యక్రమంలో తాసిల్దార్ జ్యోతి, ఎంపీడీవో శ్రీనివాసులు, డీటీ శివరాజు, మండల కోఆప్షన్ సభ్యులు ఖదీర్పాషా తదితరులు పాల్గొన్నారు.