హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత పురుషుల బాస్కెట్బాల్ జట్టుకు తెలంగాణకు చెందిన పీఎస్ సంతోష్ కోచ్గా ఎంపికయ్యారు. ఈ ఏడాది నవంబర్లో జరిగే ఫిబా ప్రపంచకప్ క్వాలిఫయర్స్ టోర్నీలో బరిలోకి దిగే భారత జట్టుకు సంతోష్ కోచ్గా వ్యవహరిస్తారు. ఇందుకోసం బెంగళూరులో ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జాతీయ పురుషుల సీనియర్ జట్టుకు రాష్ట్రం నుంచి కోచ్గా ఎంపికవ్వడం ఇదే తొలిసారి. బాస్కెట్బాల్లో సుదీర్ఘ అనుభవమున్న సంతోష్..పటియాల జాతీయ స్పోర్ట్స్ ఇనిస్టిట్యూట్ నుంచి ఫిబా లెవల్-2 కోచ్గా క్వాలిఫికేషన్ సాధించారు. దీనికి తోడు ప్రపంచ బాస్కెట్బాల్ సమాఖ్య గుర్తింపు పొందిన సంతోష్..ఎన్బీఏ, ఎన్సీఏఏ, యూరోప్ ప్రో లీగ్లో పనిచేశారు. జాతీయ సీనియర్ చాంపియన్షిప్లో ఆర్మీ, ఆంధప్రదేశ్ జట్లకు ప్రాతినిధ్యం సంతోష్.. తెలంగాణ జట్టుకు కోచ్గా పనిచేశారు.