కొచ్చి: సినీ నటుడు మోహన్ లాల్ ఇవాళ కోవిడ్ టీకా తీసుకున్నారు. కేరళలోని కొచ్చిలో ఉన్న ఓ ప్రైవేటు హాస్పిటల్లో వ్యాక్సిన్ వేయించుకున్నారు. మోహన్ లాల్ తొలి డోసు టీకాను తీసుకున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా కోవిడ్ టీకా తీసుకున్న వారి సంఖ్య 2.4 కోట్లు దాటినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పింది. ఇక గత 24 గంటల్లో టీకా తీసుకున్నవారిలో 13.5 లక్షల మంది ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. నగరంలోని అమృతా హాస్పిటల్ నుంచి తొలి డోసు కోవిడ్ టీకా తీసుకున్నట్లు మోహన్లాల్ తన ట్విట్టర్లో తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి, వ్యాక్సిన్ తయారు చేస్తున్న సంస్థలకు ఆయన థ్యాంక్స్ చెప్పారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ను నిర్వహిస్తున్న వైద్య బృందానికి, హాస్పిటళ్లకు కూడా మోహన్లాల్ కృతజ్ఞతలు తెలిపారు.