హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీనిధి యూనివర్సిటీ తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ టోర్నీలో విల్లాజియో హైల్యాండర్స్(7), ఎమ్వైఎస్ఏ(7)ముందంజలో కొనసాగుతున్నాయి. మొత్తం 16 జట్లు పోటీపడుతున్న టోర్నీ రెండో రోజైన సోమవారం గోల్ఫర్లు పోటాపోటీగా తలపడ్డారు. ఎనిమిదేసి జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి బరిలోకి దిగారు. ఆదివారం వర్షం అంతరాయం కల్గించడంతో వాయిదాపడిన గేమ్లను సోమవారం కొనసాగించారు. తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ అసోసియేషన్, హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ టోర్నీని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు.