హైదరాబాద్: జాతీయ టోర్నీలో పాల్గొనే రాష్ట్ర పారా బ్యాడ్మింటన్ జట్టును ఎంపిక చేశారు. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర పారా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి సంజీవయ్య తెలిపారు. 11 మంది ఆటగాళ్లతో నాలుగు విభాగాల్లో.. పురుషుల, మహిళల జట్లను ఎంపిక చేసినట్లు ఆయన చెప్పారు. ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్లో డిసెంబర్ 24 నుంచి 26 వరకు జాతీయ పారా బ్యాడ్మింటన్ టోర్నీ జరగనున్నట్లు ఆయన వెల్లడించారు. రైల్వేస్ మల్టీపర్సస్ ఇండోర్ స్టేడియంలో శనివారం ఈ సెలక్షన్స్ జరిగాయన్నారు. ఈ సెలక్షన్స్ కోసం రాష్ట్రం నుంచి 35 మంది పారా అథ్లెట్లు వచ్చినట్లు ఆయన తెలిపారు.
ప్లేయర్ల వివరాలు..
ఎస్ఎల్3 క్యాటగిరీలో రాహుల్ శుభాష్, సునీల్ కుమార్, ఎస్ఎల్4 క్యాటగిరీలో భార్గవ సాయి, అంశుమన్ పాండే, గౌతమ్ నాగ్, మురళి మోహన్, ఎస్యూ5 క్యాటగిరీలో టీ సంజీవయ్య, లక్ష్మా రెడ్డి, జీవన్, పవన్ శ్రీనివాస్, ఎస్యూ5 మహిళల క్యాటగిరీలో కే రిశితలు జాతీయ టోర్నీకి ఎంపికయ్యారు.