పటియాల: జాతీయ ఇంటర్స్టేట్ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ అథ్లెట్లు కాంస్య పతకాలతో మెరిశారు. మంగళవారం జరిగిన మహిళల 4 X 100 మీటర్ల రిలే రేసులో జివాంజీ దీప్తి, అగసర నందిని, నిత్య గంధె, దేవి అంతారంతో కూడిన తెలంగాణ జట్టు 45.92 సెకన్ల టైమింగ్తో మూడో స్థానంలో నిలిచింది. ఇదే విభాగంలో పోటీపడ్డ భారత జట్టు ద్యుతీచంద్, అర్చనా సుసింద్రన్, ధనేశ్వరీ, ధనలక్ష్మి స్వర్ణపతకంతో మెరువగా, శ్రీలంక టీమ్కు రజతం దక్కింది. మరోవైపు మహిళల 200 మీటర్ల రేసులో మన రాష్ర్టానికే చెంది హారికా దేవి(24.64సె) కాంస్య పతకం సాధించగా, దీప్తి(24.75సె) నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకం దక్కించుకునే అవకాశాన్ని కోల్పోయింది. పతకాలతో ఆకట్టుకున్న ప్లేయర్లను తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు స్టాన్లీ జోన్స్, కోచ్ నాగపురి రమేశ్ అభినందించారు.