హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 27: తెలంగాణ రాష్ర్టాన్ని క్రీడాహబ్గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. శుక్రవారం హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్మించిన సింథటిక్ ట్రాక్ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, చీఫ్ విప్ వినయ్భాస్కర్తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ‘సీఎం కేసీఆర్ క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక స్టేడియం కట్టడంలో భాగంగానే నగరంలో సింథటిక్, వాకింగ్ ట్రాక్ నిర్మించాం. సెప్టెంబర్ 15-19 మధ్య జాతీయ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నాం’ అని అన్నారు.