మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మార్చి 22 : అత్యాచార సంఘటనలో నిందితుడు గున్ని పెంటయ్యకు ఇరవై ఏండ్ల కారాగార శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ న్యాయమూర్తి రఘునాథరెడ్డి సోమవారం తీర్పు వెల్లడించారు. మహబూబ్నగర్ జిల్లా మహ్మదాబాద్ పీఎస్ పరిధిలోని కంచన్పల్లి గ్రామానికి చెందిన పెంటయ్య కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, గతేడాది ఫిబ్రవరిలో కూతురిపై అత్యాచారానికి పాల్పడగా, బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు విచారణలో లభించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి, కేసు అత్యంత తీవ్రమైనదిగా భావిస్తూ నిందితుడికి ఇరవై ఏండ్ల కారాగార శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. సంచలనం సృష్టించిన ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూటర్ మంజులాదేవి వాదించగా, మహబూబ్నగర్ రూరల్ ఇన్స్పెక్టర్ డీకే మహేశ్వర్ పరిశోధన అధికారిగా ఉన్నారు. కానిస్టేబుల్ ఎండీ నజీర్, కోర్టు విధులు, నిరంజన్ గౌడ్ కోర్టు లైజన్ అధికారిగా ఉన్నారు. కేసు పరిశోధన, నిందితుడికి తగిన శిక్ష ఖాయం చేయడంలో తగిన రీతిన పరిశోధన, విధులు నిర్వహించిన అధికారులను ఎస్పీ రెమా రాజేశ్వరి అభినందించారు.