కొలంబో: శ్రీలంక జట్టుతో ఆదివారం రాత్రి జరిగిన తొలి టీ-20 మ్యాచ్లో టీం ఇండియా విజయం సాధించింది. 38 పరుగులు తేడాతో టీం ఇండియా గెలుపొందింది. నిర్ణీత 20 ఓవర్లలో 18.3 ఓవర్లు ఆడిన శ్రీలంక బ్యాట్స్మన్లు 126 పరుగులకే చేతులు ఎత్తేశారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీం ఇండియా ఐదు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖార్ ధావన్ 46 పరుగులు, సూర్య కుమార్ యాదవ్ అర్థ సెంచరీతో మెరుపులు మెరిపించారు.
సంజూ శ్యామ్సన్ 27 పరుగులు చేసి పీడబ్ల్యూహెచ్ డిసిల్వా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఇషాన్ కిషన్ 20 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. దుష్మంత చమీరా, వానిందు హసంగరా రెండేసి వికెట్లు తీశారు.
165 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక బ్యాట్స్మన్లు ఎదురు నిలవలేకపోయారు. ఓపెనర్ అవిష్కా ఫెర్నాండో 26 పరుగులు, సెకండ్ డౌన్ బ్యాట్స్మన్ చారిత్ అశాలంక 44 పరుగులు మినహా మిగతా వారెవ్వరూ క్రీజ్లో నిలవలేకపోయారు. టాస్ గెలుచుకున్న శ్రీలంక బౌలింగ్ ఎంచుకున్నది.
Tokyo Olympics: టేబుల్ టెన్నిస్ మూడో రౌండ్లో మనికా బాత్రా
ఇండియా రెజ్లర్ ప్రియా మాలిక్కు గోల్డ్ మెడల్
Tokyo Olympics: మహిళల టెన్నిస్ డబుల్స్లో సానియా జోడీ ఓటమి
Tokyo Olympics: ఆ ముగ్గురు తప్ప.. రెండో రోజు ఇండియాకు నిరాశే
Mirabai Chanu: మీరాబాయి చాను టాప్ 10 ఇంస్టాగ్రామ్ పోస్టులు
భారత్లో టెస్లా యూనిట్.. ఎలన్ మస్క్ ఏమన్నారంటే?
చైనా.. అమెరికాను భారత్ దాటుతుందా.. ముకేశ్ అంబానీ ఏం చెప్పారు?
ITR FY2021-22.. ఇలా ఐటీఆర్ ఫైలింగ్ ఈజీ.. 5 హెడ్స్ కింద ఇన్కం వర్గీకరణ
Home loan Vs Plot loan| ఇంటిపై లోన్ తీసుకోవడం బెటరా.. ఇంటి స్థలంపైనా ? ఏది బెస్ట్ ?