ఇంగ్లండ్తో తొలి టెస్ట్కు ముగ్గురు స్పిన్నర్లతో టీమిండియా

ముంబై: స్పిన్తో ఇంగ్లండ్ను చుట్టేయడానికి సిద్ధమవుతోంది టీమిండియా. చివరిసారి 2016లో ఇంగ్లండ్ ఇక్కడికి వచ్చినప్పుడు స్పిన్నర్లు అశ్విన్, జడేజా ఇంగ్లిష్ బ్యాట్స్మెన్ను బెంబేలెత్తించారు. ఆ సిరీస్లో 93 వికెట్లు పడితే అందులో ఈ ఇద్దరే కలిసి 54 వికెట్లు తీసుకోవడం విశేషం. దీంతో ఈసారి కూడా స్పిన్ అస్త్రాన్నే ప్రయోగించాలని కోహ్లి సేన భావిస్తోంది. అయితే ఈ సారి జడేజా లేకపోవడంతో ఆ భారాన్ని కుల్దీప్, వాషింగ్టన్ సుందర్లాంటి యువ స్పిన్నర్లు మోయాల్సి ఉంటుంది. ఇప్పటికే తొలి రెండు టెస్టులకు నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేశారు.
ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లు
తొలి టెస్ట్కు ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాలని విరాట్ కోహ్లి భావిస్తున్నాడు. ఆ లెక్కన ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లకు తుది జట్టులో చోటు దక్కనుంది. అశ్విన్తోపాటు కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ ఈ మ్యాచ్లో ఆడే అవకాశాలు ఉన్నాయి. బ్రిస్బేన్ టెస్ట్లో సుందర్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టాడు. దీంతో ఈ ముగ్గురి కాంబినేషన్ ఇంగ్లండ్కు చిక్కులు తెచ్చిపెట్టడం ఖాయమని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది.
తాజావార్తలు
- వావ్ పొలార్డ్.. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు.. వీడియో
- జార్ఖండ్లో ఐఈడీ పేలుడు.. ఇద్దరు జవాన్లు మృతి
- తాజ్మహల్కు బాంబు బెదిరింపు
- గుడ్ న్యూస్ చెప్పిన శ్రేయా ఘోషాల్
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
- డ్యాన్స్తో అదరగొట్టిన జాన్వీ కపూర్.. వీడియో వైరల్
- ల్యాండ్ అయినట్లే అయి పేలిపోయిన స్టార్షిప్.. వీడియో
- ఏడాదిగా కూతురుపై తండ్రి లైంగిక దాడి
- దేశంలో భారీగా పెరిగిన కొవిడ్ కేసులు
- ఆదిపురుష్ సెట్ అగ్నిప్రమాదంపై పలు అనుమానాలు..!