కొలంబో: శ్రీలంకతో రెండో వన్డేలో టీమిండియా ఆటగాళ్లు తడబడుతున్నారు. 276 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 30 ఓవర్లకు 6 వికెట్ల నష్టంతో 175 పరుగులు మాత్రమే చేసింది. చమీరా వేసిన ఈ ఓవర్లో కేవలం ఐదు పరుగులే వచ్చాయి. దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా ఆటగాళ్లకు మూడో ఓవర్లో తొలి షాక్ తగిలింది. హసరంగ బౌలింగ్లో పృథ్వీ షా ( 11 బంతుల్లో 13 పరుగులు) బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ కూడా ఒక్క పరుగుకే ఔటయ్యాడు. హసరంగ బౌలింగ్లోనే శిఖర్ ధావన్ (38 బంతుల్లో 29 పరుగులు) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. మనీశ్ పాండే, సూర్యకుమార్ యాదవ్ కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. అయితే ఆరో వికెట్కి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత మనీశ్ పాండే రనౌట్ అయ్యాడు. 24వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ (53) వికెట్ కోల్పోయింది.