కోల్కతా : తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిమి చక్రవర్తి నకిలీ వ్యాక్సిన్ డోసు వేసుకుని అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం మిమి చక్రవర్తి కాప్రాలోని ఓ టీకా కేంద్రంలో వ్యాక్సిన్ వేయించుకోగా.. శనివారం ఆమెకు తీవ్ర అతిసారం, పొత్తి కడుపులో నొప్పి రావడంతో ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న వెంటనే తన ఫోన్కు మెసేజ్ రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె.. టీకా కేంద్రం నిర్వహిస్తున్న దేవన్జన్ దేవ్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, దేవన్జన్పై హత్యాయత్నం కేసు మోపే అవకాశం ఉన్నట్టు సమాచారం.