కరోనాతో బాధపడే మావోయిస్టులకు మెరుగైన వైద్యమందిస్తాం
ఉమ్మడి జిల్లాలో వారి కదలికలు లేవు
కార్యకలాపాలను అడ్డుకునేందుకు నిరంతరం చర్యలు
రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి
ఆసిఫాబాద్లో 250 మందికి రివార్డులు
ఆసిఫాబాద్,జూన్28: మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలువాలని రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 250 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి రివార్డులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి మావోయిస్టు అగ్రనేతలను పట్టిపీడిస్తుందన్న విషయం తమకు తెలిసిందని, స్వచ్ఛందంగా వస్తే వారికి మెరుగైన వైద్యం అందించి కాపాడుతామని పేర్కొన్నారు. జిల్లాలో మావోయిస్టుల కార్యకలాపాలను అడ్డుకునేందుకు నిరంతరం చర్యలు చేపడుతున్నామన్నారు.
మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలని రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఏఆర్హెడ్ క్వార్టర్స్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పోలీసు అధికారులకు,సిబ్బందికి సోమవారం రివార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో 31 స్పెషల్ పార్టీలను ఏర్పాటు చేశా మని, వారికి బెల్లంపల్లిలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గ్రే హౌండ్స్ నుంచి ప్రత్యేకంగా శిక్షకులను తీసుకువచ్చి పోలీస్ అధికారులు,సిబ్బందికి మంచి నైపుణ్యం తీసుకువచ్చేందుకు శిక్షణ ఇప్పించినట్లు తెలిపారు. మంచిర్యాల, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్,ఆదిలాబాద్ జిల్లాల్లో 31 డిస్ట్రిక్ గార్డులను ఏర్పాటు చేశామన్నారు. ఉమ్మడి జిల్లాలో 2020లో మావో యిస్టు అగ్రనేత భాస్కర్ చర్యలను తిప్పికొట్టినట్లు చెప్పారు. ప్రస్తుతం మావోయిస్టుల కార్యకలాపాలు పూర్తిగా లేవని స్పష్టం చేశారు. పోలీస్శాఖకు సహాయ సహకారాలు అందించిన ఈ ప్రాంత ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. నిరంతరం కష్ట పడుతున్న పోలీస్ అధికారులు,సిబ్బందిని ప్రోత్సహించేందుకు రివార్డు మేళా నిర్వహించినట్లు వివరించారు. మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఉంచడమే ప్రధాన లక్ష్యం అన్నారు. కరోనా మావోయిస్టు అగ్రనేతలను పట్టి పీడిస్తున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. వారు జనజీవన స్రవంతిలో కలిస్తే వైద్యం అందించి కాపాడుకుంటామని చెప్పారు. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై పీడీ యాక్టు అమలు చేస్తున్నట్లు చెప్పారు. 250 మంది అధికారులు,సిబ్బందికి రివార్డులు అందజేశారు. సమావేశంలో ఐజీలు నాగిరెడ్డి, ప్రభాకర్రావు,అడిషనల్ డీజీపీ గ్రేహౌండ్స్ శ్రీనివాసరెడ్డి, సీపీ సత్యనారాయణ, ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర, నిర్మల్,ఆదిలాబాద్ ఎస్పీలు, డీసీపీ ఉదయ్కుమార్రెడ్డి, డీఎస్పీలు ఉదయ్రెడ్డి,బాలస్వామి,అచ్చేశ్వర్రావు తదితరులున్నారు.