దోహా: ఖతార్ పర్యటనలో చివరి పోరుకు భారత ఫుట్బాల్ జట్టు సిద్ధమైంది. 2022 ఫిఫా ప్రపంచకప్, 2023 ఆసియాకప్ సంయుక్త క్వాలిఫయర్స్లో భాగంగా మంగళవారం ఆఫ్ఘనిస్థాన్తో టీమ్ఇండియా తలపడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే ఆసియాకప్ క్వాలిఫయర్స్ మూడో రౌండ్కు చేరడం ఖాయం కావడంతో సత్తాచాటాలని భారత్ పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్లో సారథి సునీల్ ఛెత్రీ (74) గోల్ చేస్తే.. అంతర్జాతీయ గోల్స్ జాబితా ఆల్టైమ్ టాప్-10లోకి అడుగుపెడతాడు. ఒకవేళ హ్యాట్రిక్ చేయగలిగేతే దిగ్గజం పీలేను సమం చేసే అవకాశం దక్కుతుంది.