న్యూఢిల్లీ: ప్రస్తుత భారత జట్టు అద్భుతాలు చేయగలదని టెస్టు బ్యాట్స్మన్ హనుమ విహారి అన్నాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు శ్రమిస్తున్న విహారి ఆదివారం మాట్లాడుతూ.. ‘డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లండ్తో సిరీస్ కోసం బాగా సిద్ధమవుతున్నా. ఐసీసీ దీన్ని ప్రవేశ పెట్టిన తర్వాత ఇదే తొలి ఎడిషన్ కావడంతో భారత అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. మేం ఫైనల్లో న్యూజిలాండ్తో తలపడబోతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో అది సవాలే. అయితే అద్భుతాలు చేసే సత్తా భారత జట్టుకు ఉంది’ అని చెప్పాడు.