డర్హమ్: ఇది చాలా అరుదుగా కనిపించేదే కానీ ఒక టీమిండియా ఆడుతుంటే.. మరో టీమిండియా టీవీల్లో ఆ మ్యాచ్ను ఆసక్తిగా చూసింది. చివరికి వాళ్ల విజయాన్ని వీళ్లు సెలబ్రేట్ చేసుకున్నారు. ఒకేసారి అటు ఇంగ్లండ్లో ఒక టీమిండియా.. ఇటు శ్రీలంకలో మరో టీమిండియా మ్యాచ్లు ఆడుతున్న విషయం తెలిసిందే. మంగళవారం కోహ్లి సారథ్యంలోని సీనియర్ టీమిండియా ఇంగ్లండ్లో ఓ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంటే.. ఇటు ధావన్ కెప్టెన్సీలోని యంగ్ టీమిండియా శ్రీలంకతో రెండో వన్డే ఆడింది.
అటు ఆ మ్యాచ్ ఆడుతూనే.. లైవ్లో వీళ్ల మ్యాచ్ను కూడా చూసింది కోహ్లి సేన. కెప్టెన్ విరాట్తోపాటు కోచ్ రవిశాస్త్రి, మిగతా టీమంతా ఈ మ్యాచ్ను చూసింది. చివర్లో దీపక్ చహర్, భువనేశ్వర్ కుమార్ జోడీ ఊహించని విజయాన్ని సాధించిపెట్టడంతో అటు ఇంగ్లండ్లోని కోహ్లి సేన ఈ గెలుపును బాగా సెలబ్రేట్ చేసుకుంది. బీసీసీఐ ఈ వీడియోను ట్విటర్లో అప్లోడ్ చేసింది. అంతకుముందు ఇండియన్ టీమ్ ఇన్స్టాగ్రామ్లోనూ టీమిండియా వాచింగ్ టీమిండియా అంటూ రోహిత్తోపాటు ఇతర ప్లేయర్స్ ఈ మ్యాచ్ను ల్యాప్టాప్లో చూస్తున్న ఫొటోను షేర్ చేశారు.