లండన్: సుమారు రెండు వందల ఏండ్ల పాటు భారత్ను పాలించిన బ్రిటీష్ గడ్డపై భారత క్రికెట్ జట్టు త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ సందర్భంగా లండన్లో ఉన్న భారత జట్టు.. వారు బస చేసిన హోటల్ వద్ద ఆదివారం 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నది. నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు.. కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి సహా ఆటగాళ్లంతా వారి భార్యా పిల్లలతో హాజరై జెండా పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా జెండాఎగురవేసిన కోహ్లీ.. సహచరులతో కలిసి జాతీయగీతాన్ని ఆలపించారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్లో పోస్ట్ చేసింది.