శ్రీలంకతో జరుగుతున్న చివరి వన్డేలో భారత బ్యాట్స్మెన్ తడబడ్డారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ స్వల్ప స్కోర్కే పరిమితమైంది. వర్షం కారణంగా కాసేపు ఆగి తిరిగి ప్రారంభమైన మ్యాచ్లో భారత్ 43.1 ఓవర్లలో 225 పరుగులకే ఆలౌటైంది. మధ్యలో వర్షం అంతరాయం కలిగించడంతో ఆతిథ్య జట్టు లక్ష్యాన్ని 47 ఓవర్లకు కుదించింది. అయినప్పటికీ నిర్ణీత ఓవర్లు పూర్తికాకముందే టీమిండియా ప్లేయర్లు పెవిలియన్ బాట పట్టారు. టీమిండియా ప్లేయర్లు. పృథ్వీ షా 49 పరుగులు, సంజూ శామ్సన్ 46 పరుగులు, సూర్య కుమార్ యాదవ్ 40 పరుగులతో రాణించారు. మిగతా బ్యాట్స్ మన్ అంతగా ఆకట్టుకోలేకపోయారు.