కొలంబో : శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఆటగాళ్లు విజృంభిస్తున్నారు. తొలుత భారత యువ ఓపెనర్ పృథ్వీ షా బౌండరీల వద్ద మోత మోగించాడు. 263 పరుగుల లక్ష్యఛేదనని కెప్టెన్ శిఖర్ ధావన్తో కలిసి ఆరంభించిన యువ ఓపెనర్ పృథ్వీ షా (43: 24 బంతుల్లో 9×4) వరుస ఫోర్లతో శ్రీలంక బౌలర్లకి కాసేపు చెమటలు పట్టించేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ ( 34 బంతుల్లో 53 పరుగులు ) హాఫ్ సెంచరీ చేశాడు. శిఖర్ ధావన్ (19)తో కలిసి 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. మొత్తానికి 15 ఓవర్లలో భారత్ స్కోర్ 127 పరుగులకు చేరింది. భారత విజయానికి మిగిలిన 35 ఓవర్లలో 136 పరుగులు చేయాల్సి ఉంది.