టోక్యో: ఒలింపిక్స్ ఆర్చరీ వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్ తరుణ్దీప్ రాయ్ శుభారంభం చేశాడు. రౌండ్ ఆఫ్ 32లో ఉక్రెయిన్కు చెందిన హన్బిన్ ఒలెక్సీపై 6-4 తేడాతో విజయం సాధించాడు. మూడు సెట్లు ముగిసే సమయానికి 2-4తో తరుణ్దీప్ వెనుకబడినా.. తర్వాత వరుసగా రెండు సెట్లు గెలిచి రౌండ్ ఆఫ్ 16లో అడుగుపెట్టాడు. చివరి సెట్లో రెండు పర్ఫెక్ట్ 10లతో తరుణ్దీప్ ఈ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.