టోక్యో: పారాలింపిక్స్( Paralympics ) ఓపెనింగ్ సెర్మనీకి కొన్ని గంటల ముందు భారత టీమ్ ఫ్లాగ్ బేరర్ మారిపోయాడు. పరేడ్లో జాతీయ పతాకాన్ని పట్టుకొని ముందు నడవాల్సిన మరియప్పన్ తంగవేలు.. ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నాడు. దీంతో అతని స్థానంలో టేక్ చంద్ ఫ్లాగ్ బేరర్గా వ్యవహరించనున్నట్లు ఇండియా పారాలింపిక్ గేమ్స్కు డిప్యూటీ చెఫ్ డె మిషన్గా ఉన్న అర్హాన్ బగాటి ట్వీట్ చేశారు. ఇండియా నుంచి టోక్యోకు వెళ్లిన విమానంలో తంగవేలుతోపాటు మరో ఐదుగురికి సమీపంలో కూర్చున్న వ్యక్తి కొవిడ్ పాజిటివ్గా తేలారు.
గత ఆరు రోజులుగా తంగవేలు, మిగతా ఐదుగురికి నెగటివ్ వచ్చినా.. ముందు జాగ్రత్తగా వాళ్లను క్వారంటైన్లో ఉంచారు. పారాలింపిక్స్లో మొత్తం 54 మంది ఇండియన్ అథ్లెట్లు పాల్గొంటున్నారు. మొత్తం 9 క్రీడల్లో వీళ్లు తలపడనున్నారు. ఆర్చరీ, పారా కనోయింగ్, అథ్లెటిక్స్, షూటింగ్, టేబుల్ టెన్నిస్, స్విమ్మింగ్, బ్యాడ్మింటన్, పవర్లిఫ్టింగ్, టైక్వాండోలలో భారత అథ్లెట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.