ముంబై: ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్పై మరోసారి విరుచుకుపడ్డాడు ఆ దేశ మాజీ క్రికెటర్ మైకేల్ స్లేటర్. ఇండియాలో కరోనా కేసుల కారణంగా అక్కడి నుంచి ఆస్ట్రేలియాకు వస్తే ఆస్ట్రేలియా పౌరులనైనా సరే జైల్లో వేస్తామన్న హెచ్చరికలపై మొన్న తీవ్రంగా మండిపడిన స్లేటర్.. తాజాగా ట్విటర్లో మళ్లీ విమర్శలు గుప్పించాడు. మానవ సంక్షోభం వంటి అంశంపై ప్రధానమంత్రికి చెప్పాల్సి రావడం ఆశ్చర్యంగా ఉంది. ఇండియాలో ఉన్న ప్రతి ఆస్ట్రేలియన్ భయంలో ఉన్నారన్నది నిజం. నువ్వు నీ ప్రైవేట్ జెట్లో వచ్చి ఇక్కడి వీధుల్లో ఉన్న శవాలను చూడు అని ఆ ట్వీట్లో స్లేటర్ అన్నాడు.
మరోవైపు కరోనాతో పోరాడుతున్న భారతీయులకు సంఘీభావం తెలిపాడు. ప్రతి భారతీయుడి కోసం నేను ప్రార్థిస్తాను. ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ మీరు నాకు అద్భుతంగా కనిపిస్తారు. దయచేసి జాగ్రత్తగా ఉండండి అని మరో ట్వీట్ చేశాడు. ఐపీఎల్లో కామెంటేటర్గా ఉన్న స్లేటర్.. తిరిగి ఇంటికి వెళ్లే విషయంలో తమ ప్రధానిపై విమర్శలు చేస్తున్నాడు. తమతో ఇంత దారుణంగా వ్యవహరించడంపై గుర్రుగా ఉన్నాడు. ఐపీఎల్ అర్ధంతరంగా ముగియడం, ఇండియా నుంచి వచ్చే వాళ్లపై ఆస్ట్రేలియా మే 15 వరకూ నిషేధం విధించడంతో ఇప్పుడు ఆ దేశానికి చెందిన ప్లేయర్స్, కామెంటేటర్లు, ఇతర సిబ్బంది శ్రీలంక మీదుగా మాల్దీవ్సకు వెళ్లి.. అక్కడి నుంచి స్వదేశానికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.