టాలీవుడ్ యాక్టర్ శర్వానంద్ ఇటీవలే శ్రీకారంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. మొదట పాజిటివ్ టాక్ వచ్చినట్టే వచ్చినా ఆశించినంత స్థాయిలో ప్రేక్షకాదరణ పొందడంలో విఫలం అయింది. జాను, పడి పడి లేచె మనసు, రణరంగం చిత్రాల తర్వాత శ్రీకారంతో శర్వానంద్ కెరీర్ లో మరో ప్లాప్ పడిపోయిందంటున్నారు టాలీవుడ్ సినీ విశ్లేషకులు.
బిజినెస్ పరంగా శ్రీకారం ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే అయినట్టు వార్తలు వచ్చినా..వరల్డ్ వైడ్గా 9.6 కోట్లు కలెక్షన్లను మాత్రమే రాబట్టినట్టు టాక్. కథానుగుణంగా సెలెక్టివ్గా సినిమాలు చేసే శర్వానంద్ నెక్ట్స్ చేస్తున్న రెండు సినిమాల పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడని అందరూ చర్చించుకుంటున్నారు. అజయ్ భూపతి డైరెక్షన్లో చేస్తున్న మహాసముద్రం, కిశోర్ తిరుమలతో చేస్తున్న ఆడాళ్లు మీకు జోహార్లు సినిమాలతో ఎలాగైనా మంచి హిట్టు కొట్టాలని భావిస్తున్నాడు శర్వానంద్.