న్యూఢిల్లీ: ఒలింపిక్స్లో మూడో రౌండ్ వరకూ చేరి ఆశ్చర్యపరిచిన టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనికా బాత్రా చిక్కుల్లో పడింది. మ్యాచ్ల సందర్భంగా నేషనల్ కోచ్ సౌమ్యదీప్ రాయ్ని మనికా బాత్రా నిరాకరించడంపై టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తీవ్రంగా పరిగణిస్తోంది. అంతేకాదు అతన్ని సుతీర్థ ముఖర్జీ వ్యక్తిగత కోచ్గా అభివర్ణించడాన్ని ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ అరుణ్కుమార్ బెనర్జీ తప్పుబట్టారు. టీమ్ ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత దీనిపై చర్చిస్తామని ఆయన స్పష్టం చేశారు. సౌమ్యదీప్ను సుతీర్థ వ్యక్తిగత కోచ్ అని అనడం ఏమాత్రం ప్రొఫెషనల్ కాదని, దీనిపై ఎలాంటి చర్య తీసుకోవాలని ఆలోచిస్తామని అరుణ్కుమార్ చెప్పారు.
ఇది తప్పుడు ప్రకటన. సౌమ్యదీప్ అకాడమీలో సుతీర్థ ఆడుతుండవచ్చు కానీ.. సౌమ్యదీప్ ఓ నేషనల్ కోచ్. తనతోపాటు కోచ్ అవసరం లేదని చెప్పడం మనికా చేసిన తప్పు. మనికా వ్యక్తిగత కోచ్ కావాలని అడిగింది. దానికి మేము కూడా సరే అన్నాం. కానీ టోక్యో వెళ్లిన తర్వాత సౌమ్యదీప్ స్థానంలో తన కోచ్ కావాలని అడగడం సరికాదు అని అరుణ్కుమార్ స్పష్టం చేశారు. ఎగ్జిక్యూటివ్ కమిటీతో చర్చించి ఎలాంటి చర్య తీసుకోవాలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.