టోక్యో: ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ రెండు రౌండ్లు దాటి సంచలనం సృష్టించిన ఇండియన్ ప్లేయర్ మనికా బాత్రా పోరాటం మూడో రౌండ్లో ముగిసింది. ఆస్ట్రియా ప్లేయర్ సోఫియా పోల్కనోవా చేతిలో ఆమె 0-4తో దారుణంగా ఓడిపోయింది. ప్రత్యర్థి దూకుడైన ఆట ముందు మనికా నిలవలేకపోయింది. పోల్కనోవా 11-8, 11-2, 11-5, 11-7 తేడాతో సునాయాసంగా గెలిచింది. అరగంటలోపే ఈ మ్యాచ్ ముగియడం విశేషం.