సెలయేళ్ల వద్ద కిలకిల రావాలతో కనువిందు
అరుదైన జాతులతో అభయారణ్యానికి కళ
కాగజ్నగర్ టౌన్, ఏప్రిల్ 3 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ డివిజన్లోని అటవీ ప్రాంతం వలస పక్షులకు ఆశ్రయమిస్తున్నది. విదేశీ పక్షులతో పాటు మహారాష్ట్ర.. రాష్ట్ర పక్షి యేల్లో ఫుటేడ్ గ్రీన్ పీజియన్ బర్డ్స్ దర్శనమిస్తున్నాయి. వేసవిలో ప్రపంచ నలుమూలల నుంచి వేలాది మైళ్లు ప్రయాణించి ఇక్కడికి వస్తుంటాయి. కాగజ్నగర్ మండలం కోసిని రిజర్వాయర్, ఊట్పల్లి, కడంబ, మాలిని, బెజ్జూరు మండలం మర్థిడి, దిగడ, పెంచికల్పేట్ మండలం పాలరాపు గుట్ట, దొడ్డుడాయి, కొండంగ లొద్ది తదితర ప్రాంతాల్లో సందడి చేస్తున్నాయి. దట్టమైన అటవీప్రాంతంలో వాగులు, చెరువులు, కుంటల వద్ద వాలుతూ కిలకిల రావాలతో కనువిందు చేస్తున్నాయి. అరుదైన జాతికి చెందిన పక్షులు మల్బార్, ఫైడ్ హంబిల్, అముల్ ఫాల్కన్, బ్యాక్ క్యాప్డ్ కింగ్ ఫిషర్, బ్రౌన్ హెడ్, బార్హెడెడ్, యురేషియన్ హబ్బీ, ట్విస్టెడ్ బంటింగ్,అల్ట్రామెరెన్ ఫ్లై క్యాచర్, వార్డెటర్ ఫ్లైక్యాచర్, రెడ్ క్రిస్టెడ్ కోచర్డ్, మహారాష్ట్ర పక్షి యెల్లో పుటేడ్ గ్రీన్ పీజియన్తో పాటు తదితర అరుదైన పక్షులు వచ్చి అనుకూల వాతావరణంలో ఆవాసాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి.
అరుదైన పక్షులను గుర్తించి..
కాగజ్నగర్ అటవీ ప్రాంతంలో వలస పక్షులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడ జల పాతాలు ఉండడంతో ఏటా వేసవిలో వలస వస్తుంటాయి. గూళ్లు ఏర్పాటు చేసుకొని కొన్ని రోజుల పాటు ఉంటాయి. నేను బ్యాచ్లర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, వైల్డ్లైఫ్ ఫొటోగ్రఫీ పూర్తి చేశాను. 2017లో అటవీశాఖలో ఉద్యోగంలో చేరాను. అటవీ ప్రాంతాల్లో తిరుగుతూ అరుదైన పక్షులను గుర్తించి వాటి ఫొటోలను ఉన్నతాధికారులకు పంపిస్తాను.
రాజేశ్ కన్ని, వైల్డ్ లైఫ్ ఫొటో గ్రాఫర్
ఇవి కూడా చూడండి..
కుంభమేళాలో కరోనా కలకలం.. హరిద్వార్లో 300కుపైగా కేసులు
మొబైల్లో మాట్లాడుతూ.. రెండు కరోనా టీకాలు వేసిన నర్సు