సాగుతో పాటు ఫ్యాక్టరీ పరిశీలన
గెలల క్రషింగ్, క్రూడాయిల్, నిల్వ గురించి వివరించిన అధికారులు
సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 3 : ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కోసం రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు సూచనల మేరకు సిద్దిపేట జిల్లాకు చెందిన 300 మంది రైతులు ఖమ్మం జిల్లా అశ్వ రావుపేట,దమ్మపేట మండలాలతో పాటు, సత్తు పల్లిలో శనివారం పర్యటించారు. ఆయిల్ఫెడ్, ఉద్యాన శాఖల ఆధ్వర్యంలో జరిగిన పర్యటన సందర్భంగా ఆయిల్పాం, అంతర పంటల సాగు, వ్యయం, ఆదాయం ప్రభుత్వ రాయితీ పథకాలను అధికారులు వివరించారు. ఆయా మండలాల్లో ఆయిల్పాం సాగు చేస్తున్న రైతు లతో నేరుగా మాట్లాడి సాగు వివరాలు సేక రించారు. అశ్వారావుపేట, దమ్మపేట మండలం అప్పారావుపేటలోని పామాయిల్ ఫ్యాక్టరీ లను సందర్శించారు. ఆయిల్ ఫెడ్ అధికారులు, ఆయిల్పామ్ సాగు చేస్తున్న అక్కడి రైతులు వారి అనుభవాలను రైతులకు వివరించారు. రైతుల వెంట జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమల అధికారి శ్రావణ్కుమార్, పలువురు హెచ్వోలు, హెచ్ఈ వోలు ఉన్నారు.