హైదరాబాద్: రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు నేటి నుంచి యథాతథంగా జరగనున్నాయి. గచ్చిబౌలిలోని స్టేట్ డాటా సెంటర్ (ఎస్డీసీ)లో ఉన్న ప్రధాన సర్వర్లో ఏర్పడిన సాంకేతిక సమస్యను గుర్తించిన అధికారులు దానిని పరిష్కరించారు. దీంతో సర్వర్ తిరిగి ప్రారంభమయ్యింది.
సర్వల్లో ఏర్పడిన సాంకేతి సమస్యతో నాలుగు రోజులుగా క్రయవిక్రయ దారులు, అధికారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమస్య పరిష్కారానికి స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ ఉన్నతాధికారులతోపాటు ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థల బృందం చేసిన ప్రయత్నాలు ఆదివారం మధ్యాహ్నం ఫలించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 141 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో లావాదేవీలు మునుపటిలాగానే కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.