అధికారులే అవినీతికి పాల్పడితే కాపాడేదెవరు?
రేషన్ డీలర్లకు బియ్యం సరఫరా కోటాలో గోదాం అధికారుల చేతివాటం
‘నమస్తే తెలంగాణ’ ఎఫెక్ట్తో బయటపడ్డ అవినీతి
ఒక్కో డీలర్కు ప్రభుత్వ నిబంధనలకంటే తక్కువ బియ్యం సరఫరా
కోస్గి, జూన్ 14 : కంచె చేను మేస్తే పంటను కాపాడేదెవరు. అధికారుల తీరు కూడా కోస్గి మండలంలో అలా తయారైంది. అవినీతి అక్రమాలు చోటుచేసుకోకుండా ప్రజలకు మేలుచేయాల్సిన అధికారులే అవినీతికి పాల్పడుతున్న వైనం కోస్గి బియ్యం గోదాంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ‘నమస్తే తెలంగాణ’లో ఆదివారం రేషన్ డీలర్ల చేతివాటం అనే శీర్షికన కథనం ప్రచురణ కావడంతో అసలు బాగోతం బయటపడింది. రేషన్ డీలర్ల కు ప్రభుత్వం నిబంధనల ప్రకారం యాభై కేజీల బి య్యం బస్తాను యాభై కేజీల ఆరువందల యాభై గ్రా ముల బరువుతో అందించాలన్న నిబంధనలున్నాయి.
కాగా కోస్గి గోదాం ఇన్చార్జి హేమ్లానాయక్ అందుకు వి రుద్ధంగా యాభై కేజీల బస్తాకు ఆరువందల యాభై గ్రా ముల బస్తా తరుగు ఇవ్వకుండా డీలర్లకు బియ్యం సరఫరా చేయడంతో డీలర్లు లబ్ధ్దిదారులకు బియ్యం తక్కువ అందించేందుకు తక్కెడలో సంచుల బరువు ఉంచి బి య్యం తూకం చేస్తున్నారు. నమస్తే తెలంగాణ కథనంతో సోమవారం డీలర్లంతా గోదాం వద్దకు చేరుకొని గోదాం ఇన్చార్జి హేమ్లానాయక్ను నిలదీయగా తనకు తెలియదని నీళ్లు నములుతూ ఇకనుంచి ఆ తప్పు జరగనివ్వనని సంచితూకం బియ్యం తానే అందిస్తానని డీలర్లకు హామీ ఇచ్చారు. ఇ న్నాళ్ల్లుగా ఒక్కో సంచికి ఆరువందల గ్రాములు తగ్గించి ఇస్తే ఒక్కోనెల ఎన్ని క్వింటాళ్ల బియ్యం మిగిలాయి. ఎక్కడ పక్కదారి పట్టించారని డీలర్లు నిలదీయడంతో గోదాం ఇన్చార్జి ముఖం చాటేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పేదలకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.