అమరావతి : ఆర్టీసీ బస్సులో అక్రమంగా తరలిస్తున్న రెమిడెసివిర్ ఇంజక్షన్లను రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టు వద్ద ఏపీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లోని గుంటూర్కు అక్రమంగా రెమిడెసివిర్ ఇంజక్షన్లను తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో గరికపాడు చెక్ పోస్ట్ వద్ద స్థానిక పోలీసులు బస్సును నిలిపి తనిఖీ చేశారు.
ఇంజక్షన్లను అక్రమంగా తరలిస్తున్న గుప్తవరపు అజయ్ కుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్త్తున్నారు. కరోనా చికిత్సకు వినియోగించే రెమిడెసివిర్ ఇంజక్షన్లను కొందరు బ్లాక్ మార్కెట్ చేసి విక్రయిస్తున్నారు. దందాను అరికట్టేందుకు ఇరు తెలుగు రాష్ట్రాల పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.