రంగం, వీడొక్కడే, బ్రదర్స్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన దర్శకుడు కేవీ ఆనంద్. శంకర్ దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన ఆనంద్కు.. ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్ బాగానే అలవాటైంది. అందుకే శంకర్ సినిమాల్లో ఉండే గ్రాండియర్ ఆనంద్ సినిమాల్లో కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈయన మహేశ్ బాబుతో సినిమా చేయాలని చాలాకాలంగా ప్రయత్నించాడు. కానీ చివరికి ఆ కోరిక తీరకుండానే ఆయన కన్నుమూశాడు.
రంగం సినిమా విడుదలై తెలుగులో కూడా సంచలన విజయం సాధించిన తర్వాత కేవీ ఆనంద్ గురించి టాలీవుడ్లో కూడా చర్చ జరిగింది. ఎవరీ దర్శకుడు.. ఇంత బాగా తీశాడు అంటూ ఈయన గురించి ఆరా తీశారు. అదే సమయంలో మహేశ్ బాబుతో కేవీ ఆనంద్ సినిమా దాదాపు ఖరారైపోయింది. అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయడమే ఆలస్యం అనుకున్న తరుణంలో సూర్య పిలిచి మరీ ఒక అవకాశం ఇచ్చాడు. అదే బ్రదర్స్.. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా పరాజయం పాలైనా దర్శకుడిగా కేవీ ఆనంద్ ప్రతిభను ప్రపంచానికి చూపించింది.
బ్రదర్స్ ఫ్లాపయినా కూడా మహేశ్ బాబు ఈయనతో పని చేయాలి అనుకున్నాడు. కానీ అదే సమయంలో ఆగడు డిజాస్టర్ అయింది. ఆ సమయంలో తమిళ దర్శకులతో ప్రయోగాలు చేయడం ఇష్టం లేని మహేశ్ బాబు.. కేవీ ఆనంద్ సినిమా వదిలేశాడు. అలా ఒక అరుదైన కాంబినేషన్ సెట్స్ పైకి రాకుండానే ఆగిపోయింది. ఒకవేళ అన్నీ కుదిరి మహశ్ బాబు, కేవీ ఆనంద్ కాంబినేషన్ లో సినిమా వచ్చుంటే మాత్రం ఖచ్చితంగా అదిరిపోయేది అంటున్నారు అభిమానులు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
సరికొత్త టైటిల్తో సోనాక్షిసిన్హా..!
అక్షయ్ ఫ్యాన్స్ లో నిరాశ..నిర్మాణ సంస్థ క్లారిటీ…
ఇంట్రెస్టింగ్గా సినిమా బండి ట్రైలర్..వీడియో
కరోనా ఎఫెక్ట్..ఇటలీలో థాంక్యూ షూట్ రద్దు
పాయల్కు నెగెటివ్ పాత్రలే వస్తున్నాయా..?
షూటర్ చంద్రోతోమర్ మృతి..తాప్సీ, భూమి సంతాపం
శంకర్-చెర్రీ ప్రాజెక్టుకు యువ రచయిత డైలాగ్స్..!…
రావు రమేశ్ ఛాలెంజింగ్ రోల్..!
బాలకృష్ణలో మరో యాంగిల్..తెలుసుకోవాల్సిందే..!