న్యూఢిల్లీ: సాగర్ రాణా హత్య కేసులో అరెస్టయిన స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ పోలీసు కస్టడీని ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టు మరో నాలుగు రోజులు పొడిగించింది. ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో జరిగిన గొడవలో యువ రెజ్లర్ రాణా మృతి చెందగా.. ఆ ఘటనతో సంబంధముందని ఆరోప ణలు ఎదుర్కొంటున్న సుశీల్తో పాటు అజయ్ కుమార్కు మే 23న కోర్టు ఆరు రోజుల రిమాండ్ విధించింది. విచారణకు సుశీల్ సహకరించడం లేదని, మరో ఏడు రోజులు తమకు అప్పగించాలని ఢిల్లీ పోలీసులు శనివారం కోరగా.. న్యాయస్థానం మరో నాలుగు రోజుల కస్టడీకి అంగీకరించింది. రాణా హత్య వెనుక మాస్టర్ మైండ్ సుశీల్దేనని కోర్టుకు పోలీసులు తెలిపారు. రాణా మృతి తర్వాత దాదాపు 19 రోజుల పాటు పరారీలో ఉన్న సుశీల్ ఈ నెల 23న ఢిల్లీ పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే. మరోవైపు రాణాపై దాడి జరిగిన సమయంలో సుశీల్ చేతిలో కర్ర పట్టుకున్న ఫొటో ఒకటి బయటికి రావడంతో అతడి పాత్రపై ఆరోపణలు మరింత బలపడ్డాయి.