వ్యవసాయ యూనివర్సిటీ: రాగులలో బియ్యం కంటే 30 రెట్లు అధికంగా క్యాల్షియం ఉంటుందని ప్రొ॥ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డా॥ జగదీశ్వర్ అన్నారు. ఆయన విలేకర్లతో మంగళవారం మాట్లాడుతూ, చిరు ధాన్యాలలో ప్రధానమైనవి రాగులు (తైదలు), జొన్నలు, కొర్రలు, సజ్జలన్నారు. ఈ పం టలు ప్రధానంగా దక్షణ తెలంగాణలోనే అధికంగా సాగు చేసేందుకు ఇక్కడి వాతావరణం అనుకూలిస్తుందన్నారు. నాడు రైతులు అధికంగా పండించేవారని, తక్కువ నీటి వనరులే అవసరం ఉండటంతో వర్షాధారితంగా తొలకరి చినుకులు పడగానే సాగు చేసేవారన్నారు.
వర్షాలు తక్కువగా నమోదు కావ డం, భూగర్భ జలాలు పడిపోవడంతో పాటు వాణి జ్య పంటలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల చిరు ధాన్యా ల శాతం తగ్గిందన్నారు. ప్రస్తుతం వాటి దిగుబడి తగ్గి, డిమాండ్ పెరిగిందన్నారు. వాటి సాగుకు ప్రభు త్వం కూడా ప్రోత్సహిస్తుందన్నారు. వ్యవసాయ శా స్త్రవేత్తల కృషి వల్ల తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడినిచ్చే వంగడాలు మార్కెట్లో ఉన్నాయని సూచించారు. కాల్షియం రాగులలో బియ్యం కంటే 30 రెట్లు అధికంగా ఉంటాయన్నారు.