లండన్: శ్రీలంకతో వన్డే సిరీస్లో ఆకట్టుకున్న యువ ఆటగాళ్లు పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్ ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికయ్యారు. గాయాల కారణంగా శుభ్మన్ గిల్, వాషింగ్టన్ సుందర్ టెస్టు సిరీస్కు అందుబాటులో లేకుండా పోవడంతో వారి స్థానంలో ఈ ఇద్దరిని సెలెక్షన్ కమిటీ ఇంగ్లండ్కు పంపాలని నిర్ణయించినట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా సోమవారం పేర్కొన్నాడు. స్టాండ్బై బౌలర్ అవేశ్ ఖాన్ గాయంతో స్వదేశానికి తిరుగు పయనం కాగా.. బెంగాల్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్కు ప్రధాన జట్టులో చోటు దక్కింది. మరోవైపు కరోనా వైరస్ బారిన పడిన రిషబ్ పంత్ పూర్తిగా కోలుకోగా.. మరో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ఐసోలేషన్ ముగించుకున్నారని జై షా తెలిపాడు.