భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా విశ్వక్రీడల ఫైనల్కు దూసుకెళ్లాడు. బరిలోకి దిగిన తొలి ఒలింపిక్స్లోనే నీరజ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. బుధవారం క్వాలిఫయింగ్ రౌండ్ తొలి ప్రయత్నంలోనే నీరజ్ ఈటెను 86.65 మీటర్ల దూరం విసిరి తుదిపోరుకు అర్హత సాధించాడు. ఫైనల్ క్వాలిఫికేషన్ మార్క్ 83.50 మీటర్లు కాగా.. గ్రూప్-ఏలో బరిలోకి దిగిన 23 ఏండ్ల నీరజ్ మొదటి సారే అంతకన్నా మూడు మీటర్ల దూరం ఈటెను విసిరి నేరుగా తుదిపోరుకు చేరాడు. గ్రూప్-బి నుంచి పాకిస్థాన్కు చెందిన నదీమ్ అర్షద్ (85.16 మీటర్లు) అగ్రస్థానంతో ఫైనల్లో అడుగుపెట్టాడు. ఇదే విభాగంలో పోటీపడిన శివ్పాల్ సింగ్ (76.40 మీటర్లు) ఫైనల్కు అర్హత సాధించలేకపోయాడు.