అంబరంలో విన్యాసాలు అదుర్స్

- ముగిసిన పారా మోటార్ చాంపియన్షిప్
- ఏరో స్పోర్ట్స్ కేంద్రం ఏర్పాటుకు కృషి: మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్ టౌన్, జనవరి 17: పాలమూరు వేదికగా తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్వంలో ఐదు రోజుల పాటు అద్భుతంగా సాగిన ఏరో స్పోర్ట్స్ జాతీయస్థాయి పారా మోటార్ చాంపియన్షిప్ ముగిసింది. మహబూబ్నగర్ స్టేడియంలో ఆదివారం చివరి రోజు పోటీలకు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహబూబ్ నగర్లో ఏరో స్పోర్ట్స్ కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. వాలీబాల్, అథ్లెటిక్స్ అకాడమీలు ఏర్పాటు చేసి జిల్లాను స్పోర్ట్స్హబ్గా తీర్చిదిద్దుతామని చెప్పారు. జాతీయ స్థాయి ఏరో స్పోర్ట్స్ పాలమూరులో అద్భుతంగా సాగడం గర్వకారణమని అన్నారు. కాగా తెలంగాణ సహా పది రాష్ర్టాల పారా మోటర్ పైలట్లు చాంపియన్షిప్లో విన్యాసాలు ప్రదర్శించారు. చాంపియన్షిప్లో తెలంగాణ పైలట్ ఇమాద్ ఫారుఖి రెండో స్థానాన్ని దక్కించుకోగా.. నితిన్కుమార్ (హర్యానా) విజేతగా నిలిచాడు. మూడో స్థానంలో సత్యనారాయణ (తమిళనాడు) నిలిచాడు. వీరికి మంత్రి శ్రీనివాస్గౌడ్ బహుమతులు ప్రదానం చేశారు. థాయ్లాండ్లో జరిగే చాంపియన్షిప్లో వీరు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక కార్యదర్శి కేఎస్ శ్రీనివాసరాజు, కలెక్టర్ వెంకట్రావు, డీవైఎస్వో శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- తుపాకీ లైసెన్స్ ఇవ్వండి.. పోలీసులకు హత్రాస్ యువతి విజ్ఞప్తి
- భారీ మెజారిటీతో ‘పల్లా’ను ఎమ్మెల్సీగా గెలిపించాలి : మంత్రి ఎర్రబెల్లి
- కేటీఆర్ పీఏనంటూ మోసాలు.. రంజీ మాజీ క్రికెటర్ అరెస్ట్
- రష్మీ హాట్ అందాలకు యువత దాసోహం
- టెస్ట్ అరంగేట్రానికి 50 ఏండ్లు.. గవాస్కర్ను సత్కరించిన బీసీసీఐ
- అతను తెలియక తప్పు చేశాడు: బీహార్ సీఎం
- బీజేపీలోకి నటుడు మిథున్ చక్రవర్తి?
- ఇన్కం టాక్స్ దాడులపై స్పందించిన హీరోయిన్ తాప్సీ
- బుమ్రా, అనుపమ పెళ్లిపై వచ్చిన క్లారిటీ..!
- అశ్విన్, అక్షర్.. వణికిస్తున్న భారత స్పిన్నర్లు