దుబాయ్: ఏ కరోనా కారణంగా వాయిదా పడి ఇండియా నుంచి యూఏఈకి తరలిపోయిందో ఆ ఐపీఎల్( IPL 2021 )లో మరోసారి కరోనా కలకలం రేపింది. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్కు కొద్ది గంటల ముందు సన్రైజర్స్ బౌలర్ నటరాజన్ కరోనా బారిన పడినట్లు తేలింది. అతనితో సన్నిహితంగా ఉన్న ఆరుగురు ఐసోలేషన్లో ఉన్నారు. అయితే మిగతా ప్లేయర్స్కు నెగటివ్ రావడంతో ఢిల్లీ, సన్రైజర్స్ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని ఐపీఎల్ స్పష్టం చేసింది.
నటరాజన్కు కరోనా సోకినట్లు ఐపీఎల్ ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే ప్రస్తుతం అతనికి ఎలాంటి లక్షణాలూ లేవు. మిగతా టీమ్ సభ్యులకు దూరంగా అతడు ఐసోలేషన్లో ఉంటున్నాడు. అతనితో సన్నిహితంగా ఉన్న మరో ప్లేయర్ విజయ్ శంకర్.. టీమ్ మేనేజర్ విజయ్కుమార్, ఫిజియో శ్యామ్ సుందర్, డాక్టర్ అంజనా వన్నన్, లాజిస్టిక్స్ మేనేజర్ తుషార్ ఖేడ్కర్, నెట్ బౌలర్ పెరియసామి కూడా ఐసోలేషన్లో ఉన్నారు. వీళ్లందరికీ బుధవారం ఉదయం 5 గంటలకు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించినట్లు ఐపీఎల్ ఆ ప్రకటనలో తెలిపింది.