దుబాయ్: యార్కర్ స్పెషలిస్ట్ తంగరసు నటరాజన్ కరోనా మహమ్మారి బారిన పడటంతో.. సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ అతడి స్థానంలో మీడియం పేసర్ ఉమ్రాన్ మాలిక్ను రిప్లేస్మెంట్ కింద జట్టులోకి తీసుకుంది. ఐపీఎల్ 14వ సీజన్ రెండో దశ మ్యాచ్లు యూఏఈ వేదికగా జరుగుతుండగా.. ఢిల్లీ, హైదరాబాద్ మ్యాచ్కు ముందు ఆటగాళ్లకు నిర్వహించిన పరీక్షల్లో నటరాజన్కు కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది. దీంతో అతడు జట్టును వీడి ఐసోలేషన్కు పరిమితం కాగా.. నెట్ బౌలర్గా ఉన్న ఉమ్రాన్ను రైజర్స్ యాజమాన్యం జట్టులోకి తీసుకుంది. జమ్ము కశ్మీర్ తరఫున ఒక టీ20, ఒక లిస్ట్-ఏ మ్యాచ్ ఆడిన ఉమ్రాన్.. నాలుగు వికెట్లు పడగొట్టాడు.