న్యూయార్క్: గ్రాండ్స్లామ్ ఈవెంట్లలో ఆడటం అటుంచి కనీసం వాటిలో అర్హత సాధించడానికి కూడాభారత టెన్నిస్ ఆటగాళ్లు చతికిలపడుతున్నారు. యూఎస్ ఓపెన్కు ముందు అర్హత రౌండ్లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ మ్యాచ్లలో నాగల్, రాంకుమార్లు ఓటమితో వెనుదిరిగారు. నాగల్ 5-7, 6-4, 3-6 తేడాతో జువాన్ పబ్లో ఫికోవిచ్ (అర్జెంటీనా) చేతిలో పరాజయం పాలయ్యాడు. మరోవైపు రాంకుమార్ రామనాథన్.. 6-4, 6-7, 4-6 తేడాతో ఎవెంగి డొన్సోయ్ (రష్యా) చేతిలో ఓడిపోయాడు. కాగా, 2014 నుంచి గ్రాండ్స్లామ్ అర్హత మ్యాచ్లలో ఆడుతున్న రాంకుమార్కు ఇది 21వ ఓటమి కావడం గమనార్హం.