న్యూఢిల్లీ: సీనియర్ల గైర్హాజరీలో భారత యువ షట్లర్లు సుదిర్మన్ టోర్నీకి సిద్ధమయ్యారు. మిక్స్డ్ టీమ్ చాంపియన్షిప్ గ్రూప్-ఏలో ఉన్న భారత్.. ఆదివారం తొలి మ్యాచ్లో థాయ్లాండ్తో తలపడనుంది. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పీవీ సింధుతో పాటు స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్, డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ఈ టోర్నీకి దూరం కాగా.. కిడాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్, అశ్విని పొన్నప్ప, సిక్కిరెడ్డి బరిలోకి దిగనున్నారు. ఫిన్లాండ్ వేదికగా జరుగనున్న ఈ బీడబ్ల్యూఎఫ్ టోర్నీ ‘టై’లో రెండు సింగిల్స్ మ్యాచ్లు మూడు డబుల్స్ మ్యాచ్లు ఉంటాయి. పురుషుల సింగిల్స్లో శ్రీకాంత్, సాయిప్రణీత్ కీలకం కాగా.. డబుల్స్లో సిక్కిరెడ్డి-అశ్విని, ఆర్జున్-ధ్రువ్ కపిల జోడీలపై ఆశలు ఉన్నాయి. తొలి మ్యాచ్లో థాయ్లాండ్ను ఎదుర్కోనున్న భారత్ ఆ తర్వాత చైనా, ఫిన్లాండ్తో అమీతుమీ తేల్చుకోనుంది.