న్యూఢిల్లీ: భారత మాజీ ఆల్రౌండర్ స్టువర్ట్ బిన్నీ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఫస్ట్క్లాస్తో పాటు అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు సోమవారం బిన్నీ వెల్లడించాడు. 37 ఏండ్ల బిన్నీ.. భారత్ తరఫున ఆరు టెస్టులు, 14 వన్డేలు, 3 టీ20 మ్యాచ్లు ఆడాడు. ‘ఫస్ట్క్లాస్, అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నా. టీమ్ ఇండియాకు ఆడటం నాకెంతో గర్వకారణం. నా కెరీర్ ఎదుగుదలకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు’ అని బిన్నీ ఒక ప్రకటనలో తెలిపాడు.