60 ఏళ్లలో కానిది.. ఆరున్నరేళ్లలో చేసి చూపించాం
మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపు
బస్వరాజ్ శిరీషను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి
మట్టెవాడ, ఏప్రిల్ 26 : అరవై ఏళ్లలో లేని అభివృద్ధిని ఆరేళ్లలో చేసి చూపించామని, రూ.1300 కోట్లతో రోడ్డు విస్తరణ, పచ్చదనం, పారిశుధ్య పనులు చేపట్టి వరంగల్ను సుందరంగా తీర్చిదిద్దామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్తో కలిసి చార్బౌలి వాటర్ట్యాంక్ వద్ద నిర్వహించిన రోడ్షోలో మాట్లాడారు. హైదరాబాద్ తర్వాత పెద్ద నగరమైన వరంగల్ను గత పాలకులు ఏనాడూ పట్టించుకోలేదని.. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే అనూహ్య ప్రగతి సాధించిందని చెప్పారు. నగరాన్ని మరింత అభివృద్ధి చేయాలంటే టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని గ్రేటర్పై గులాబీ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు. గతంలో ఎండాకాలం వచ్చిందంటే విద్యుత్ కోతలు, తాగునీటి కష్టాలుండేవని సీఎం కేసీఆర్ పాలనలో నిరంతర విద్యుత్, మిషన్ భగీరథలో ఇంటింటికీ తాగునీరు వస్తున్నదన్నారు.
షాదీఖానాలు, కబరస్థాన్లకు ప్రహరీల నిర్మాణం, మసీద్లకు మరమ్మతులు చేయించిన పార్టీ టీఆర్ఎస్సేనని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన, చేస్తున్న అభివృద్ధి పనులను చూసి 25వ డివిజన్ అభ్యర్థి బస్వరాజు శిరీషను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు సముచిత స్థానం ఇస్తున్నది పార్టీ టీఆర్ఎస్సేనని, గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి రెండు సీట్లను ముస్లింలకు ఇచ్చామన్నారు. సీటు ఎవరికి ఇచ్చినా హిందూ, ముస్లింలు ఐకమత్యంతో గెలిపించుకుంటున్న ఘనత స్థానికులదేనన్నారు. టీఆర్ఎస్ నుంచి నామినేషన్ ఉపసంహరించుకున్న సోమ పావని-మధుకర్ను అభినందించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరిన నాయకులకు మంత్రి ఈశ్వర్ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ త ర్వాత 24వ డివిజన్ పాపయ్యపేట చమన్లో, 26వ డివిజన్ చా ర్బౌలి ఎల్లమ్మగుడి వద్ద ప్రచారం చేశారు. నాయకులు బస్వరాజు శ్రీమాన్, సోమ మధుకర్, తోట వేణుమాధవ్ ఉన్నారు.
ఇవి కూడా చదవండి
బెయిర్స్టో టాయిలెట్లో ఉన్నాడా? సూపర్ ఓవర్ ఎందుకు ఆడలేదు?
చాన్నాళ్లకు లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు