మందమర్రి రూరల్, ఏప్రిల్ 5 : ఈపీ ఆపరేటర్ల ఎంపిక పరీక్షల్లో పాల్గొననున్న ఉద్యోగులు తమ నైపుణ్యతను ప్రదర్శించి ఉత్తీర్ణత సాధించాలని మందమర్రి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ సూచించారు. సోమవారం స్థానిక సింగరేణి పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఈపీ ఆపరేటర్ల ఎంపిక పరీక్షలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈపీ ఆపరేటర్ల కోసం ఏరియా నుంచి మొత్తం 235 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. సోమవారం 77 మంది హాజరయ్యారని, ఇందులో 43 మంది ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. మూడు రోజలు నిర్వహించనున్న పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన వారికి ఈ నెల 11వ తేదీన కొత్తగూడెంలో రాత పరీక్షలు ఉంటాయన్నారు. ఏజీఎం జగన్ మోహన్రావు, కార్పొరేట్ డీజీఎం ప్రదీప్, పీఎం వర ప్రసాద్, డీవై పీఎం శ్యామ్ సుందర్, ఎస్ఈ ప్రభాకర్, ఎస్అండ్పీసీ ఎస్ఎస్వో రవి, సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.
మంచిర్యాలటౌన్(శ్రీరాంపూర్), ఏప్రిల్ 5 : ప్రగతి స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈపీ ఆపరేటర్స్ ఎంపిక పరీక్షలను జీఎం సురేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి రోజు 130 మంది పరీక్షల్లో పాల్గొన్నారని, 66 మంది క్వాలీఫై అయ్యారని చెప్పా రు. పరిశీలకులు ఎన్ వెంకటేశ్వర్రావు, ఈఈ కుమార్, ఇన్చార్జి ఎస్వో టూజీఎం చిరంజీవులు, డీవైజీఎం గోవిందరాజు, డీవీరావు, ఎస్ఈ నీలాద్రి, సెక్యూరిటీ ఆఫీసర్ మురళీకృష్ణ, పీఎం రాజేశ్వర్రావు, తుకారాం, తదితరులు పాల్గొన్నారు.