హైదరాబాద్ : ఇంటి ముందు పార్క్ చేసిన బైక్లను దొంగిలించి అమ్ముతున్న దొంగను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి ఆరు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన నగరంలోని నల్లకుంటలో చోటుచేసుకుంది. సైదాబాద్లో నివాసం ఉండే మహబూబాబాద్వాసి ఎన్ ముకేష్(24) నల్లకుంట, సుల్తాన్ బజార్, సైదాబాద్, చిలకలగూడ, చైతన్యపురి పోలీసు స్టేషన్ల పరిధిలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఆయా కాలనీల్లో రాత్రి వేళల్లో తిరుగుతూ ఇంటి ముందు పార్క్ చేసిన బైక్లను చోరీ చేస్తున్నాడు. అనంతరం వాటిని విక్రయిస్తున్నట్లు కాచిగూడ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. నిందితుడిని కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.