హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఇటలీలో జరుగుతున్న ప్రపంచ ఆప్టిమిస్టిక్ సెయిలింగ్ చాంపియన్షిప్నకు రాష్ర్టానికి చెందిన పడిదాల విశ్వనాథ్ ఎంపికయ్యాడు. రివాడెల్ గార్డ నిర్వహణలో జరుగుతున్న ఈ టోర్నీలో భారత్ తరఫున బాలుర జూనియర్ కేటగిరీలో పోటీపడనున్నాడు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థి అయిన విశ్వనాథ్ 12 ఏండ్ల వయసులో నేవీ బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ(ఎన్బీఎస్సీ)కి ఎంపికయ్యాడు. నేవీ, భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) సంయుక్త భాగస్వామ్యంలో ఏర్పాటైన ఎన్బీఎస్సీలో వి శ్వనాథ్ సెయిలింగ్లో రాటుదేలాడు. నిరుపేద కూలీ కుటుంబం నుంచి వచ్చిన ఈ యువ సెయిలర్..2017 సబ్ జూనియర్ అంతర్జాతీయ రెగెట్టా చాంపియన్షిప్లో రజత పతకంతో మెరిశాడు. ఒలింపిక్స్, ఆసియా లాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో రాణించడమే తన లక్ష్యమని విశ్వనాథ్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు.