హైదరాబాద్, ఆట ప్రతినిధి: పటియాల వేదికగా జరుగుతున్న జాతీయ సీనియర్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో రాష్ర్టానికి చెందిన ఎమ్ఆర్ చైతన్య కాంస్య పతకంతో మెరిశాడు. గురువారం జరిగిన పురుషుల 109 కిలోల విభాగంలో చైతన్య.. స్నాచ్లో 126కిలోలు, క్లీన్ అండ్ జర్క్లో 161కిలోలు.. మొత్తంగా 287 కిలోలు ఎత్తి మూడో స్థానంలో నిలిచాడు.