పుణె: ఇంగ్లండ్తో జరిగిన చివరి వన్డేలో శార్దూల్ ఠాకూర్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, భువనేశ్వర్కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కకపోవడంపై కెప్టెన్ విరాట్ కోహ్లి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా శామ్ కరన్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా జానీ బెయిర్స్టో నిలిచారు. దీనిపై మ్యాచ్ తర్వాత మాట్లాడిన కోహ్లి.. నేరుగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
నిజాయితీగా చెప్పాలంటే అతడికి (శార్దూల్) మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించింది. 65 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. 20 బంతుల్లో 30 పరుగులు చేశాడు. ఇక భువీ కూడా మ్యాన్ ఆఫ్ ద సిరీస్కు అర్హుడే. ఆరు పరుగుల లోపు ఎకానమీతో అతడు ఆరు వికెట్లు తీశాడు. రెండు జట్ల మధ్య మిడిల్ ఓవర్లలో, కొత్త బాల్తోనూ ఉన్న పెద్ద తేడా వీళ్లిద్దరే. సిరీస్ విజయంలో ఈ ఇద్దరిదే కీలకపాత్ర అని కోహ్లి అన్నాడు.
ప్రతి మ్యాచ్లో 300కుపైగా స్కోర్లు నమోదైన వన్డే సిరీస్లో భువనేశ్వర్ మాత్రం కేవలం 4.65 ఎకానమీ రేటుతో 6 వికెట్లు తీయడం విశేషం. రెండు జట్లలోనూ ఏ బౌలర్ కూడా అతనికి దరిదాపుల్లో లేడు. అటు శార్దూల్ టీ20, వన్డే సిరీస్లలో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్గా నిలిచాడు. టీ20ల్లో 8, వన్డేల్లో 7 వికెట్లు తీశాడు.
ఇవికూడా చదవండి..
సుయెజ్ కాలువలో కదిలిన ఎవర్ గివెన్ షిప్
మయన్మార్ రక్తపాతం.. దారుణం, భయంకరమన్న బైడెన్
ప్రపంచ వాణిజ్యానికి ట్రాఫిక్ జామ్
చిన్నారి పెళ్లికూతురు పెళ్లి పీటలెక్కిందా?
తీరొక్క ఆప్షన్లతో ధరణి పోర్టల్