కొలంబో: శ్రీలంక వన్డే కెప్టెన్గా కుశాల్ పెరెరా ఎంపికయ్యాడు. బంగ్లాదేశ్తో ఈనెలలో జరిగే మూడు వన్డేల సిరీస్ కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్ఎల్సీ) బుధవారం జట్టును ప్రకటించింది. లంక తరఫున 101 వన్డేలాడిన కుశాల్ బంగ్లాతో వన్డే సిరీస్కు నాయకుడిగా వ్యవహరించనుండగా, కుశాల్ మెండిస్ వైస్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తిస్తాడు. ఇదిలా ఉంటే మాజీ కెప్టెన్ దిముత్ కరుణరత్నె, మాథ్యూస్, దినేశ్ చండిమల్కు ఉద్వాసన ఎదురైంది. ఈ ముగ్గురు సీనియర్లను పక్కనపెడుతూ సెలెక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. మరోవైపు చమికా కరుణరత్నె, షిరాన్ ఫెర్నాండో తొలిసారి జాతీయజట్టుకు ఎంపికయ్యారు. బంగ్లాతో మూడు వన్డేల కోసం ఈనెల 16న లంక జట్టు బయల్దేరి వెళ్లనుంది.