ఢాకా: కుశాల్ పెరీరా సారథ్యంలోని శ్రీలంక క్రికెట్ టీమ్ బంగ్లాదేశ్ రాజధాని ఢాకా చేరుకుంది.
లంక జట్టు మూడు రోజుల పాటు క్వారంటైన్లో ఉండనుంది. ఆతిథ్య బంగ్లా టీమ్తో మూడు వన్డేల సిరీస్లో లంక టీమ్ తలపడనుంది. మే 21న ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. వన్డే సూపర్ లీగ్లో భాగంగా జరగనున్న సిరీస్లో మే 23, 25, 28 తేదీల్లో మ్యాచ్లు జరగనున్నాయి. షేర్ బంగ్లా నేషనల్ స్టేడియం మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనుంది.
బంగ్లాతో సిరీస్కు శ్రీలంక 18 మంది సభ్యుల బృందాన్ని గత బుధవారం ప్రకటించింది. ఇటీవల ఇరుజట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ జరిగింది. రెండో టెస్టులో బంగ్లాను 209 పరుగులతో ఓడించిన శ్రీలంక..మొదటి టెస్టును డ్రాగా ముగించింది.